నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్లో మరో విషాదం చోటు చేసుకుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూశారు. శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురవడంతో రమేష్ రాథోడ్ను ఆస్పత్రికి తరలించారు. ఉట్నూర్లోని ఆయన నివాసంలో రమేష్ రాథోడ్ అస్వస్థతకు గురికాగా చికిత్స అందిస్తున్న సమయంలో కోమాలోకి వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో రమేష్ రాథోడ్ మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు.