మాజీ సర్పంచ్ మృతి.. ఎమ్మెల్యే నివాళులు


నవతెలంగాణ మద్నూర్: డోంగ్లీ మండలంలోని లింబూరు గ్రామ మాజీ సర్పంచ్ రామ్ పటేల్ శుక్రవారం అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు లింబూర్ గ్రామాన్ని సందర్శించి నివాసానికి వెళ్లి మృతుడు మాజీ సర్పంచ్ రామ్ పటేల్ భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Spread the love