బైకు ట్రాక్టర్ ఢీ.. చిన్నారి మృతి

నవతెలంగాణ – మద్నూర్

డోంగ్లి మండలంలోని లింబూరు వాడి గ్రామానికి చెందిన రాజు చందు కన్విక బైక్ పై మద్నూర్ నుండి సొంత గ్రామమైన లింబూర్ వాడి గ్రామానికి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో వెళ్తుండగా.. మద్నూర్ మండలంలోని తడి ఇప్పర్ గా గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ కు ఢిక్కొట్టిన ఘటనలో చిన్నారి  సాన్విక ఆరు సంవత్సరాలు ఘటన స్థలంలో అక్కడికక్కడే మృతి చెందిది. రాజు చందు ఇద్దరికీ తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాల పాలైన రాజు చెందుకు నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మద్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈ ఘటనపై పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు.
Spread the love