కొప్పుల ఈశ్వర్ ను ఆదరించాలి: మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు

నవతెలంగాణ – మల్హర్ రావు
పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను ఆదరించాలని మండల మాజీ జెడ్పిటిసి గోనె శ్రీనివాసరావు, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కుంభం రాఘవరెడ్డి, తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు ప్రజలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మధుకర్ ఆదేశాల మేరకు శనివారం మండలంలోని ఎడ్లపల్లి, ఆన్ సాన్ పల్లి గ్రామాల్లో పలు చెరువుల్లో ఉపాధిహామీ పనులు చేస్తున్న ఉపాది కూలీల వద్దకు వెళ్లి ఓట్లను అభ్యర్దిoచారు.ఉపాధి హామీ కూలీలతో మమేకమై కారు గుర్తుకు ఓటేసి కొప్పుల ఈశ్వర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్నికలు వస్తేనే కాంగ్రెసోళ్లకు పథకాలు గుర్తుకొస్తాయని, ఎన్నికల తర్వాత వాటి అమలును దాటవేస్తారని, అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను ఇంతవరకు ఎందుకు చేయలేదో ప్రజలు ఆలోచన చేయాలన్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం ఇచ్చి అరిగోస పడుతున్నామని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఆగమైపోతామని అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆశీర్వదించాలని, గతంలో మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవలు చేశారన్నారు.ఈ కార్యక్రమంలో కొప్సన్ ఆయూబ్ ఖాన్, పుట్టపాక శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, యదగిరిరావు, తాజాద్దీన్ బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love