మంచినీళ్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి: మోతిరావు నాయక్

నవతెలంగాణ – గాంధారి
మండలం ఎంపీడీవోను కలవడం జరిగింది బిర్మల్ తండా, సోమారం తండా, కొత్తబాది తండా పలు గ్రామాలలో మంచినీళ్ల సమస్యలు విపరీతంగా ఉందని వెంటనే పరిష్కరించాలని ఎంపీడీవో  వినతి పత్రం సమర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ మే నెలలో మంచినీళ్లు దొరకక చాలా ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు ఎన్నికల కోడ్ పేరు చెబుతూ మేమేమి చేయలేని పరిస్థితులు ఉన్నామని అనడం మంచిది కాదన్నారు. మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉన్నా కోడ్ పేరు చెప్పి మంచి నీళ్లు అందికపోవడం చాలా విడ్డూరంగా ఉందని అన్నారు. వెంటనే పలు తాండ గ్రామాలలో బోర్ మోటార్ వేయించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని మోతిరాం నాయక్ డిమాండ్ చేశారు. లేనిచో ఈనెల 21 సోమవారం రోజు ఖాళీ బిందెలతో మండల కార్యాలయం ముందు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ప్రకాష్ నాయక్ కూడా పాల్గొన్నారు.
Spread the love