స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన మిత్రులు

నవతెలంగాణ-బోడుప్పల్: అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి చిన్న నాటి మిత్రులు అండగా నిలిచారు. నూతనకల్ ZPHS పాఠశాలలో 2000-2001 బ్యాచ్ జూలూరి సతీష్ కుమార్ అనే మిత్రుడు అనారోగ్యంతో ఇటీవల చనిపోయాడు. మిత్రుడి అకాల మరణంతో చలించిన మిత్రులు తమతోపాటు చదువుకున్న చిన్ననాటి మిత్రుడు జూలూరి సతీష్ కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సహాయం అందజేసారు. జెడ్పిహెచ్ఏస్ నూతనకల్ (2000-2001) బ్యాచ్ కి చెందిన మిత్రుల సహకారంతో 40వేల 500వందల రూపాయలను సతీష్ కుటుంబ సభ్యులకు ఆదివారం అందజేసారు. ఈ కార్యక్రమంలో సాగర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేష్, ఆగమల్లు, శ్రీదర్, సంతోష్, చిరంజీవి తదితరుల పాల్గొన్నారు.

Spread the love