మండలంలో పలు గ్రామాలలో గడపగడపకు ప్రచారం

 – కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్..
నవతెలంగాణ- రెంజల్: రెంజల్ మండలంలోని సాటాపూర్, కూనేపల్లి, రెంజల్, తాడు బిలోలి, వీరన్న గుట్ట, దూపల్లి. గ్రామాలలో గడపగడపకు ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోబిన్ ఖాన్, స్పష్టం చేశారు. మండల కేంద్రమైన రెంజల్ గ్రామంలో మాజీ జెడ్పిటిసి నాగభూషణం రెడ్డి, సాయిబాబా గౌడ్, కొండలవాడి శేఖర్  ఆధ్వర్యంలో ప్రతి వార్డులో కాంగ్రెస్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు జి సాయి రెడ్డి, సిహెచ్ రాములు, బాబన్న, బూత్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love