బీఆర్ఎస్ షేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా గాంధీ నామినేషన్

– పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు
– అభివృద్ధి చూసి ఓటేయమంటూ నినాదాలు
నవతెలంగాణ- మియాపూర్
బీఆర్ఎస్ షేర్ లింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆరిక పూడి గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి తిరిగి తమ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని శేర్లింగంపల్లి ప్రాంతానికి ప్రత్యేకత ఉందని అనేక ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివాసం ఉంటున్నారని ఆయన తెలిపారు. వారందరి అభివృద్ధికి కృషి చేశామని ఆయన తెలిపారు.

Spread the love