- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్
గణేష్ ఉత్సవాలలో భాగంగా ఆదివారం పట్టణంతో పాటు మున్సిపల్ పరిధిలోని పెర్కిట్, మామిడిపల్లిలలో అన్నదాన కార్యక్రమాలు జోరందుకున్నాయి. పట్టణంలోని ఐదవ తప్ప పద్మశాలి సంఘంలో జరిగిన వినాయకుని ప్రత్యేక పూజ, అన్నదాన కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు దంపతులు పాల్గొన్నారు. హౌసింగ్ బోర్డ్ హనుమాన్ ఆలయంలో పెర్కిట్ వినాయక రెసిడెన్సిలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
- Advertisement -



