కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా గీ రెడ్డి మహేందర్ రెడ్డి

నవ తెలంగాణ- రామారెడ్డి
 కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పోసానిపేట సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గీ రెడ్డి మహేందర్ రెడ్డిని గురువారం నియమించారు. జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నియామక పత్రాన్ని మహేందర్ రెడ్డి కి అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు, నాపై మరింత బాధ్యత పెరిగిందని, మరింత ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. ఉపాధ్యక్షుడిగా నియమించినందుకు మాజీ మంత్రి షబ్బీర్ అలికి, జిల్లా అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ కు, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డికి, మండల పార్టీ అధ్యక్షులు నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love