ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళ ఉద్యోగులకు గోల్డ్ మెడల్స్

నవతెలంగాణ మల్హర్ రావు: అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542. జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్,పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కె.వెంకటస్వామి,ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మన్ చేతులమీదుగా కాళేశ్వరం జోన్ మల్హర్ మండలంలో ఉత్తమ మహిళ ఉద్యోగులుగా ఎంపికైన వివిధ శాఖలకు చెందిన 20 మందికి ప్రసంశ పత్రాలు,అవార్డులు పెద్దపల్లి జెడ్పి చైర్మన్ పుట్ట మదుకర్ చేతులమీదుగా అందజేసినట్లుగా ఎంపిక కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్, జాతీయ మానవ హక్కుల మండలి మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ లు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహానియురాలు సావిత్రీబాయి పూలే 194 జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రములోని అమర్ చంద్ కల్యాణ మండపం జెండా చౌరస్తాలో ప్రశంస పత్రాలు, మెమెంటోలు, గోల్డ్ మెడల్స్, శాలువాలతో ఘనంగా సన్మానాలు, సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పుస్తకాలు అందజేసీనట్టుగా తెలిపారు. అవార్డులు పొందిన ఉద్యోగులు వీరే..
మండలంలోని వివిధ శాఖలకు సంబంధించిన ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు పొందిన మహిళ ఉద్యోగుల్లో కొయ్యుర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుళ్ళుగా విధులు నిర్వహిస్తున్న సుధారాణి, రోజా, సౌజన్య, శిరీష, రమాదేవి, వ్యవసాయ శాఖ నుంచి ఏఈఓ లు శిరీష, మనీషా, అనూష, ఐసిడిఎస్ నుంచి అంగన్ వాడి టీచర్లు పద్మ, అన్నపూర్ణ, రమాదేవి, పంచాయతీ కార్యదర్శులు సరితా, వెన్నెల, సునీత, ఆరోగ్య శాఖ నుంచి ఏఎన్ఎంలు సరితా, సాధన, ఆశా కార్యకర్త ఇందారపు రాజేశ్వరి, పారెస్టు శాఖ నుంచి బిట్ అధికారులు వనజ, పద్మ, పంచాయతీ రాజ్ నుంచి పారిశుధ్య కార్మికురాలు అక్కపాక ఓదెమ్మ తదితరులు ప్రసంశ పత్రాలు, గోల్డ్ మెడల్స్, జ్ఞాపికలు, శాలువాలతో ఘన సన్మానం పొందారు.

Spread the love