- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతులకు గిట్టుబాటు ధరతో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. పంట కొనుగోలులో ఎలాంటి కోతలు ఉండవని హామీ ఇచ్చారు. సన్న వడ్లకు క్వింటాలుకు ₹500 బోనస్ అందిస్తున్నామని చెప్పారు. అలాగే రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేసినట్లు గుర్తు చేశారు.
- Advertisement -



