- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఏపీ, తెలంగాణలో ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. వంట గ్యాస్ కనెక్షన్లకు ఈ-కేవైసీ పూర్తి చేయాల్సిన గడువును ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 7 వరకు పొడిగించినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా సుమారు 86 శాతం మంది డొమెస్టిక్ ఎల్పీజీ వినియోగదారులు ఈ-కేవైసీ పూర్తి చేసుకున్నారు. గడువు ముగిసిన తర్వాత కూడా ఈ-కేవైసీ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ, ధరల తేడా విధానం అమల్లోకి వస్తే మాత్రం సబ్సిడీ ధరపై రీఫిల్ లభించకపోవచ్చని అధికారులు తెలిపారు.
- Advertisement -



