ఏపీతో సత్సంబంధాలు

Good relations with AP– ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తాం
– ఉమ్మడిగా సమస్యలు పరిష్కరించుకుంటాం : సీఎం రేవంత్‌రెడ్డి
తిరుమల : ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా ఏర్పడే ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారికి తన మనువడి పుట్టువెంట్రుకల మొక్కును చెల్లించుకున్నారు. దర్శనానంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ఏర్పడే ప్రభుత్వంతో కలిసి సమస్యలు పరిష్కరించుకుని కలిసికట్టుగా నడుస్తామన్నారు. రెండు రాష్ట్రాల అభివద్ధికి ఒకరికొకరు సహకరించుకోవాలని ఆకాంక్షిం చారు. తిరుమలలో తెలంగాణ ప్రభుత్వం తరఫున సత్రం, కళ్యాణ మండపం నిర్మిస్తామని ప్రకటించారు. శ్రీవారి సేవలో తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యం కూడా తీసుకోవాలని ఏపీ సీఎంకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.

Spread the love