నవతెలంగాణ – హైదరాబాద్: టెక్ టైటాన్ గూగుల్ బుధవారం భారతదేశంలోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ వాలెట్ యాప్ను ప్రారంభించింది. బోర్డింగ్ పాస్లు, లాయల్టీ కార్డ్లు, ఈవెంట్ టిక్కెట్లు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పాస్లు వంటి వాటిని సేవ్చేయడానికి దీనిని వాడుకోవచ్చు. భారతదేశంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ డిజిటల్ వాలెట్, ప్రస్తుతం ఉన్న పేమెంట్ యాప్ గూగుల్ పేకి కాంప్లిమెంటరీ సర్వీస్గా ఉంటుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గూగుల్వాలెట్ కోసం ఎయిర్ఇండియా, ఇండిగో, ఫ్లిప్కార్ట్, పైన్ల్యాబ్స్, కొచ్చి మెట్రో, పీవీఆర్ఐనాక్స్వంటి 20 భారతీయ బ్రాండ్లతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.