నవతెలంగాణ-హైదరాబాద్ : గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ప్రిలిమనరీ కీతో పాటు ఓఎంఆర్ షీట్లను వెబ్సైట్లో ఉంచింది. వీటితో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. కాగా, 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గానూ జూన్ 11వ తేదీన పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
‘కీ’ కోసం క్లిక్ చేయండి