బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్న గుమ్ముల మోహన్ రెడ్డి

నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిక్ ఫౌండేషన్ బాధ్యులు గుమ్ముల మోహన్ రెడ్డి బ్లడ్ డోనర్ మోటివేటర్ అవార్డు అందుకున్నారు.శుక్రవారం హైదరాబాదులోని రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో  గవర్నర్ కార్యదర్శి బుర్ర వెంకటేశం చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ప్రతిక్ ఫౌండేషన్ ద్వారా పలుమార్లు రక్తదాన కార్యక్రమాలు నిర్వహించి జిల్లాలో అత్యధికంగా బ్లడ్ డొనేషన్ చేసినందుకు గవర్నర్ కార్యదర్శి గుమ్మలకు అవార్డు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ గోలి అమరేందర్ రెడ్డి, కోశాధికారి మారెడ్డి శ్రీనివాస రెడ్డి, జెడ్ పి టి సి వంగూరి లక్ష్మయ్య పాల్గొన్నారు.
Spread the love