- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలోని టెక్సాస్లో కాల్పుల ఘటన కలకలం రేపింది. కారోల్టన్లోని ‘కె టౌన్ ప్లాజా’ షాపింగ్ సెంటర్లో దుండగుడు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వ్యాపార లావాదేవీల గురించి చర్చిస్తుండగా ఉద్దేశపూర్వకంగానే దుండగుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
- Advertisement -



