- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 11 లేదా 12న అల్పపీడనం ఏర్పడనుందని ఇస్రో వాతావరణ నిపుణులు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు ద్రోణి కారణంగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తుండగా.. మరో రెండు రోజులు వర్ష సూచన ఉంది. కాగా అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- Advertisement -



