- Advertisement -
హైదరాబాద్ : జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జిమ్నాస్టిక్స్ సమ్మర్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. అమీర్పేట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్వహించిన ఫ్లోర్, బ్రిడ్జ్ బ్యాలెన్స్ పోటీల్లో 4-13 ఏండ్ల చిన్నారులు ఉత్సాహంగా పోటీపడ్డారు. బాలికలు, బాలురు అన్ని వయో విభాగాల్లో పసిడి, రజతం, కాంస్యం నెగ్గిన విజేతలకు జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోన్ స్పోర్ట్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మోసెస్, జిమ్నాస్టిక్స్ కోచ్లు మహేశ్ కుమార, మహ్మద్ ముస్తాఫా తదితరులు బహుమతులు ప్రధానం చేశారు.
- Advertisement -



