మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందజేత

– ఆర్థిక సహాయం చేసిన భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) నాయకులు
నవతెలంగాణ – తాడ్వాయి
మండలంలోని గంగారం గ్రామపంచాయతీ పరిధిలో గల భూపతిపూర్ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు కొడెం మల్లయ్య-పద్మ ల కూతురు అంకిత ఇటీవల మృతి చెందింది. గురువారం దశదినకర్మ సందర్భంగా కాటాపూర్ ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) కార్మికులు సందర్శించి వారి కుటుంబాన్ని పరామర్శించి, ఓదార్చారి 15వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుడు కొడెం మల్లయ్య కుటుంబానికి భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం (సీఐటీయూ) మండల అధ్యక్షులు చిట్టినేని శ్రీనివాస్, కాట నర్సింగరావు, తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు దుగ్గి చిరంజీవి, భవన నిర్మాణ కార్మికులు కనుమల్ల శ్రీను, ఎట్టి నరేష్, పల్నాటి సత్యం, నామని సారయ్య, పర్వతాల కృష్ణ మబ్బు నరేష్, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love