- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : తెలంగాణలో నేడు పొడి వాతావరణం ఉంటుందని, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో వడగాలులు వీస్తాయని ఐఎండి అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వడగాలుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అటు ఏపీలో మన్యం, అల్లూరి, పోలవరం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది.
- Advertisement -



