నవతెలంగాణ – హైదరాబాద్: సూపర్ స్టార్ రజనీకాంత్ ఆకస్మికంగా హైదరాబాద్ లోని నాగోల్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్(ఓసీసీ)ను గురువారం సందర్శించారు. ఓ సినిమా చిత్రీకరణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన రజనీ మెట్రోరైలు సంస్థ అభ్యర్థన మేరకు ఇక్కడికి వచ్చి చాలాసేపు గడిపారు. సంస్థ ఎండీ కేవీబీరెడ్డి, సీఓఓ సుధీర్ చిప్లూలంకర్, సీఎస్ఓ మురళీ వరదరాజన్ హైదరాబాద్ మెట్రోరైలు ఆపరేషన్స్లో కీలకమైన ఓసీసీ గురించి రజనీకి వివరించారు. అక్కడి సిబ్బంది ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు.