Wednesday, May 20, 2026
E-PAPER
Homeబీజినెస్కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హిందుస్థాన్ జింక్ ఆతిథ్యం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి హిందుస్థాన్ జింక్ ఆతిథ్యం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత జింక్ ఉత్పత్తిదారు , ప్రపంచంలోని అగ్రశ్రేణి వెండి ఉత్పత్తిదారులలో ఒకటైన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (BSE: 500188 & NSE: HINDZINC), రాజస్థాన్‌లోని తమ రాజ్‌పురా దరిబా కాంప్లెక్స్‌లో భారత ప్రభుత్వ బొగ్గు మరియు గనుల శాఖ గౌరవనీయ కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ పర్యటనలో భాగంగా ఆయన, ప్రపంచంలోనే అతిపెద్ద వెండి ఉత్పత్తి చేసే గనులలో ఒకటిగానూ . సాంకేతికంగా అత్యంత ఆధునికమైన భూగర్భ గనులలో ఒకటైన, కంపెనీకి చెందిన సిందేసర్ ఖుర్ద్ గనిని మరియు అత్యాధునిక లోహ శుద్ధి కేంద్రమైన దరిబా స్మెల్టింగ్ కాంప్లెక్స్‌ను సమగ్రంగా సందర్శించారు.

సంవత్సరానికి 1.1 మిలియన్ టన్నులకు పైగా శుద్ధి చేసిన లోహాల ఉత్పత్తి సామర్థ్యంతో భారతదేశ ఖనిజ భద్రతను, దేశీయ లోహా పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో హిందుస్థాన్ జింక్ వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. దేశ మౌలిక సదుపాయాల విస్తరణ, తయారీ రంగ వృద్ధి, ఇంధన పరివర్తన , అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అవసరమైన ముడి పదార్థాలను సమకూర్చుకోవడంలో భారతదేశ మైనింగ్ మరియు లోహాల రంగం యొక్క పెరుగుతున్న వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఈ పర్యటన నొక్కి చెప్పింది. స్టీల్ గాల్వనైజేషన్, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ మరియు అధునాతన తయారీ రంగాలకు జింక్, సీసం మరియు వెండి వంటి లోహాలు అత్యంత కీలకం. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో, భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల, స్వయం సమృద్ధిగల ఉత్పాదక మరియు పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న తరుణంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో, ఖనిజ భద్రతను బలోపేతం చేయడంలో మరియు దేశానికి దీర్ఘకాలిక ఆర్థిక విలువను అందించడంలో భారీస్థాయి, సాంకేతికత ఆధారిత, ప్రపంచవ్యాప్తంగా పోటీపడగల మైనింగ్ కార్యకలాపాల అభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుంది.

ఈ పర్యటన సందర్భంగా గౌరవనీయ మంత్రిగారితో పాటు హిందుస్థాన్ జింక్ సీఈఓ శ్రీ అరుణ్ మిశ్రా, గనుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ వివేక్ బాజ్‌పాయ్, మరియు కంపెనీ సీనియర్ నాయకత్వ బృందం కూడా ఉన్నారు. ఈ పర్యటన సందర్భంగా గౌరవనీయ మంత్రి, సిందేసర్ ఖుర్ద్ గనిని భూగర్భంలో సందర్శించారు. ఈ గని తన పరిమాణం, వెండి సమృద్ధిగా ఉన్న ఖనిజ నిక్షేపాలు, భద్రత, ఉత్పాదకత మరియు కార్యాచరణ నైపుణ్యంపై దృష్టి సారించిన సాంకేతిక ఆధారిత పద్ధతుల ద్వారా భూగర్భ మైనింగ్‌లో ఒక ప్రమాణంగా నిలుస్తుంది. ఆయన ప్రొడక్ట్ గ్యాలరీని సందర్శించారు. అక్కడ గని చరిత్ర, సామర్థ్యం, భద్రతా వ్యవస్థలు, పేస్ట్ ఫిల్లింగ్ , టెలి-రిమోట్ కార్యకలాపాలపై ఒక ప్రత్యేక వీడియో ప్రజెంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. ఆయన కంట్రోల్ రూమ్‌ను కూడా సందర్శించి, రిమోట్ ద్వారా పనిచేసే పరికరాలను మంత్రి సమీక్షించారు. సురక్షితమైన, మరింత సమర్థవంతమైన భూగర్భ మైనింగ్ కోసం కంపెనీ అనుసరిస్తున్న సాంకేతిక ఆధారిత విధానాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశారు. మైనింగ్ కార్యకలాపాలలో సమ్మిళితత్వం, సామర్థ్య నిర్మాణం , భద్రతా నైపుణ్యం కోసం కంపెనీ చేస్తున్న కృషిని గుర్తిస్తూ భారతదేశపు మొట్టమొదటి మహిళా గని రెస్క్యూ బృందం నిర్వహించిన ప్రత్యక్ష ప్రదర్శనను కూడా గౌరవనీయ మంత్రి వీక్షించారు.

సిందేసర్ ఖుర్ద్ గని క్యాంటీన్‌లో భోజన విరామ సమయంలో, ఆయన 54 మంది జింక్ రత్న కాంట్రాక్ట్ కార్మికులు, మహిళా మైనింగ్ ఇంజనీర్లు , ఇతర ఉద్యోగులతో సంభాషించారు. హిందుస్థాన్ జింక్ యొక్క కార్యాచరణ నైపుణ్యానికి, భారతదేశ మైనింగ్ వృద్ధి గాథకు వారు చేసిన కృషిని ఆయన అభినందించారు.

దరిబా స్మెల్టింగ్ కాంప్లెక్స్‌లో, గౌరవనీయ మంత్రి గారు కంట్రోల్ రూమ్, సెల్ హౌస్ మరియు క్యాథోడ్ యార్డ్‌ను సందర్శించి, హిందుస్థాన్ జింక్ యొక్క సమీకృత మైనింగ్-టు-మెటల్ సామర్థ్యాలను మరియు సురక్షితమైన, బాధ్యతాయుతమైన, విలువ జోడించిన లోహాల ఉత్పత్తిపై దాని దృష్టిని గురించి తెలుసుకున్నారు.

ఆయన కాంప్లెక్స్‌లోని మహిళా నాయకులను కూడా కలుసుకుని, సమ్మిళితత్వం, నాయకత్వ అభివృద్ధి, కార్మిక శక్తి వైవిధ్యం కోసం హిందుస్థాన్ జింక్ చేస్తున్న ప్రయత్నాలను, ముఖ్యంగా లోహాలు , మైనింగ్ రంగంలో దాని 26.3% మహిళా కార్మికులను ప్రశంసించారు.

గౌరవనీయ భారత ప్రభుత్వ బొగ్గు , గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, “వికసిత భారత్ 2047 దిశగా భారతదేశ ప్రస్థానం, దాని ఖనిజ వనరులు, స్వదేశీ సామర్థ్యాలు , భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న పరిశ్రమల బలంపై నిర్మితమవుతుంది. హిందుస్థాన్ జింక్ యొక్క కార్యకలాపాలు, దేశ మైనింగ్ రంగం దేశానికి ఒక ఆధునిక, బాధ్యతాయుతమైన, సాంకేతికత ఆధారిత వృద్ధి చోదకంగా ఎలా అభివృద్ధి చెందుతోందో ప్రతిబింబిస్తున్నాయి. మైనింగ్ నుండి మెటల్ వరకు దాని సమీకృత సాంకేతికత-ఆధారిత సామర్థ్యాలు, భద్రతపై దృష్టి, ఆవిష్కరణలు, విభిన్న శ్రామిక శక్తి మరియు సమాజ అభివృద్ధి వంటివి గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఊహించినటువంటి ఆత్మనిర్భర పారిశ్రామిక పర్యావరణ వ్యవస్థను ప్రదర్శిస్తున్నాయి.

భారతదేశం తమ కీలక ఖనిజ విలువ చైన్ ను బలోపేతం చేస్తున్నందున దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో, దేశీయ వనరుల నుండి అధిక విలువను రాబట్టడంలో మరియు తయారీ రంగానికి, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంకు మద్దతు ఇవ్వడంలో హిందుస్థాన్ జింక్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ పరివర్తనకు బాధ్యతాయుతమైన మైనింగ్ కేంద్రంగా ఉంటుంది, ఇది భారతదేశం తన ఖనిజ సామర్థ్యాన్ని జాతీయ బలంగా, పారిశ్రామిక పోటీతత్వంగా మరియు సమ్మిళిత వృద్ధిగా మార్చుకోవడానికి వీలు కల్పిస్తుంది” అని అన్నారు.

ఈ పర్యటన రాజస్థాన్ అంతటా హిందుస్థాన్ జింక్ చేపట్టిన లోతైన సమాజ అభివృద్ధి కార్యక్రమాలను కూడా వెల్లడించింది. గౌరవనీయ మంత్రి గారు ఒక సమగ్ర కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ప్రదర్శన ద్వారా ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సమీక్షించారు. వీటిలో మహిళా సాధికారత మరియు వ్యవస్థాపకత కోసం ‘సఖి’; సురక్షితమైన తాగునీటి లభ్యత కోసం ‘ఆర్ఓ వాటర్ ఏటీఎం’లు; గ్రామీణ యువతకు నాణ్యమైన విద్య మరియు విద్యా సహాయం కోసం ‘శిక్షా సంబల్’; గ్రామీణ వర్గాలకు చెందిన ‘జింక్ ఫుట్‌బాల్’ బాలికా క్రీడాకారిణులు; మరియు మొబైల్ హెల్త్ వ్యాన్‌లు, క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాల ద్వారా ఆరోగ్య సంరక్షణ విస్తరణ వంటివి ఉన్నాయి.

కంపెనీ యొక్క ప్రతిష్టాత్మక ‘ఉంచి ఉడాన్’ కార్యక్రమ లబ్ధిదారులతో కూడా ఆయన సంభాషించారు. వీరు విజయవంతమైన వృత్తిని నిర్మించుకుని, ప్రస్తుతం కోల్ ఇండియాలో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది హిందుస్థాన్ జింక్ యొక్క విద్యా ఆధారిత సామాజిక కార్యక్రమాల దీర్ఘకాలిక ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమాలు వ్యాపార వృద్ధితో పాటు దీర్ఘకాలిక సామాజిక ప్రభావాన్ని సృష్టించాలనే హిందుస్థాన్ జింక్ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.

బాధ్యతాయుతమైన మైనింగ్, వనరుల సామర్థ్యం, నీటి నిర్వహణ, ఇంధన పరివర్తన, తక్కువ-కార్బన్ వృద్ధి మరియు కార్యకలాపాల అంతటా సాంకేతికత-ఆధారిత పరివర్తన దిశగా హిందుస్థాన్ జింక్ చేస్తున్న ప్రయత్నాలతో సహా, దాని సుస్థిరత ప్రయాణం గురించి కూడా ఆయనకు వివరించారు. ఖనిజ భద్రతను పెంపొందించడం, దేశీయ వాల్యూ చైన్ ను బలోపేతం చేయడం, దేశ దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి మద్దతు ఇవ్వడంలో భారతీయ మైనింగ్ కంపెనీల పాత్రపై చర్చలు కేంద్రీకరించబడ్డాయి.

హిందుస్థాన్ జింక్ తన కార్యకలాపాలకు అతీతంగా, ఉపాధి కల్పన, స్థానిక సంస్థల అభివృద్ధి, సామాజిక మౌలిక సదుపాయాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ, నీటి లభ్యత , మహిళల నేతృత్వంలోని జీవనోపాధి కార్యక్రమాల ద్వారా రాజస్థాన్ సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తూనే ఉంది. మైనింగ్, స్మెల్టింగ్ మరియు అనుబంధ కార్యకలాపాలలో కంపెనీ యొక్క సమగ్ర కార్యకలాపాలు , ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలను బలోపేతం చేయడానికి దోహదపడటంతో పాటు, దాని కార్యకలాపాల చుట్టూ ఉన్న కమ్యూనిటీలు దీర్ఘకాలిక వృద్ధిలో పాల్గొనేలా చేసింది.

కార్యాచరణ నైపుణ్యాన్ని సాంకేతికత, సుస్థిరత , కమ్యూనిటీ అభివృద్ధితో మేళవించి, స్వయం సమృద్ధి దిశగా హిందుస్థాన్ జింక్ అనుసరిస్తున్న సమగ్ర విధానాన్ని ఈ పర్యటన పునరుద్ఘాటించింది. కీలక ఖనిజాలు, దేశీయ తయారీ మరియు పటిష్టమైన సరఫరా చైన్ లతో రూపుదిద్దుకున్న భవిష్యత్తు దిశగా భారతదేశం పయనిస్తున్న తరుణంలో, బాధ్యతాయుతమైన మైనింగ్‌ను ప్రోత్సహించడం, విలువ జోడించిన లోహాలను సృష్టించడం, రాజస్థాన్ అభివృద్ధికి మద్దతు ఇవ్వడం , వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి దోహదపడటంపై హిందుస్థాన్ జింక్ దృష్టి సారించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -