నవతెలంగాణ-(వేల్పూర్) ఆర్మూర్
విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆదివారం బ్రహ్మంగారి ఆలయంలో శాలువా, మెమొంటో, మెడల్, ప్రశంసా పత్రంతో, 12 మంది పిల్లలను సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు మండాజి దయాకర్, రాగి ప్రభాకర్ లు మాట్లాడుతూ పిల్లలు ఏది కోరుకుంటే అదే సబ్జెక్టు పై తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, పిల్లలు బాగా చదువుకొని రాష్ట్రస్థాయిలో మంచి ఉద్యోగం సాధించాలని మీ తల్లిదండ్రులకు మీ గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరినారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు జమ్మల గిరి గంగయ్య, ప్రధాన కార్యదర్శి వన్నెల సురేందర్, కోశాధికారి జమ్మలగిరి, రాజేందర్, విద్యార్థులు బంగారు అన్వేష్, జమ్మల గిరి ,శ్రీకాంత్ భూమేష్, రాజేందర్, సంఘ సభ్యులు మహిళలు పాల్గొన్నారు.
ప్రతిభ కనబరచిన విద్యార్థులకు సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



