Friday, April 17, 2026
E-PAPER
Homeజాతీయంనాకు తొమ్మిది హామీలు కావాలి : ప్రధాని మోడీ

నాకు తొమ్మిది హామీలు కావాలి : ప్రధాని మోడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 9 పనుల గురించి మోడీ హామీ తీసుకున్నారు.

‘‘మీ నుంచి నాకు తొమ్మిది హామీలు కావాలి. వికసిత్‌ కర్ణాటక కోసం మీరంతా నాకు వాటిపై ప్రమాణం చేయండి. ఈ ప్రమాణాలను శ్రద్ధగా, నిజాయతీగా పాటిస్తే కర్ణాటకతో పాటు దేశ అభివృద్ధీ వేగంగా జరుగుతుంది’’ అని మోడీ వెల్లడించారు. ప్రధాని అడిగిన హామీలు ఏంటంటే..

  1. నీళ్లను వృథా చేయకుండా పొదుపుగా వాడదాం.
  2. పబ్లిక్‌ ప్రదేశాల్లో పరిశుభ్రతను పాటిద్దాం
  3. అమ్మ పేరుతో మొక్కలు నాటుదాం.
  4. ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ స్వదేశీయతను చాటి చెబుదాం.
  5. జాతీయ పర్యావరణ రంగాన్ని అభివృద్ధి చేద్దాం.
  6. రసాయనాలు లేకుండా పంట సాగు చేద్దాం.
  7. ఆహారంలో మిల్లెట్స్‌ని భాగం చేసుకుందాం.
  8. నూనె పదార్థాలను పూర్తిగా తగ్గిద్దాం.
  9. ఫిట్‌గా, బరువుని అదుపులో ఉంచుతూ, ప్రకృతికి సేవ చేద్దాం
    ఇక, ఆయుష్మాన్‌ భారత్‌ పథకంలో భాగంగా కొన్ని కోట్ల మంది ప్రజలకు ఉచితంగా వైద్య సౌకర్యం అందిస్తున్నామని మోడీ ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం ఈ పథకం కింద 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు కూడా అవకాశం కల్పించామని గుర్తుచేశారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -