
– వారి మీద వారికి నమ్మకం లేక దేవుళ్ళను వాడుకుంటున్నారు
– మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
నవతెలంగాణ – జమ్మికుంట
రాముని మీద రాజకీయం చేస్తే ఓట్లు రాలవని, ఓట్ల కోసం దేవుని అక్షింతలు బీజేపీ నాయకులు ఇంటింటికి పంపించారని, వారి మీద వారికి నమ్మకం లేకనే దేవుళ్లను బీజేపీ నాయకులు వాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే జన జాతర సభ ఏర్పాట్లను, హెలిపాడ్ స్థలాన్ని నియోజకవర్గ ఇన్చార్జి ఒడి తల ప్రణవ్ బాబు తో కలిసి ఆయన పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు.60 వేల మందితో జమ్మికుంట లో జన జాతర సభ వేసవి దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
హుజురాబాద్ నుండి జన జాతర సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని కోరారు .కేంద్రంలోని మోడీ చేస్తున్న అవినీతి పాలనపై,50 రోజుల్లో ధరలను తగ్గిస్తానని చెయ్యలేదని అనే విమర్శించారు. నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటాయని, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన దుయపెట్టారు.మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి హయంలో 20 వేల కోట్ల రూపాయలను కొట్టేసాడని ఆయన ఆరోపించారు.తాళి బొట్లు అమ్ముకునే అనే వాళ్లకు ఆళి విలువ ఏం తెలుస్తుందని చురక అంటించారు .భారతదేశపు ఆస్తిని అదానికి అంటగట్టాడుఅనిచెప్పారు.
సీబీఐ,ఈడి,ఐటి దర్యాప్తు సంస్థలను దగ్గరపెట్టుకొని పి యం మోడీ ఆడిస్తున్నాడని మండిపడ్డారు. ఎలక్ట్రో బాండ్ లను విడుదల చేయడం లేదని, అర్హులు కానీ వారు కూడా ఎన్నికల బాండ్ లను కొన్నారని ఆయన ఆరోపించారు.శరత్ చంద్ర లాంటి వాళ్ళు క్విడ్ ప్రో కో చేశారని ,కప్పం కట్టందే కేసులు మాఫీ కాలేదని,దయ్యాలు వేదాలు వల్లించినట్లు మోడీ మాట్లాడడం దురదృష్టకరమన్నారు. బీజేపీ అభ్యర్థి బండికి చదువు లేదని, పొద్దున్న లేస్తే దేవుడి పేరు తప్ప ఏం లేదని ఆయన విమర్శించారు.మొన్నటి ఎన్నికల్లో ఒక నియంతను బొంద పెట్టారని, రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కేంద్రంలో బిజెపి ఓడిపోతుందని అనే జోష్యం చెప్పారు.మా కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు గురించి మాట్లాడిన కేటీఆర్,నువ్వు రాజకీయాలు కు రానప్పుడు చొప్పదండి నియోజక వర్గంలో కేసిఆర్ తో బి ఫాం వేసిన వ్యక్తి రాజేందర్ రావు అని తెలిపారు.2009 లో కరీంనగర్ నుండి పోటీ చేసిన వ్యక్తి రాజేందర్ రావు అని,పరిచయం లేని వ్యక్తి హన్మకొండ నుండి వచ్చిన వినోద్ కుమార్ వలస వాదిని తెచ్చుకున్నారు ఆయన అన్నారు.ఇక్కడే పుట్టి పెరిగిన వ్యక్తి రాజేందర్ రావు అని చెప్పారు. అభ్యర్థులు దొరకని పరిస్థితుల్లో బి ఆర్ఎస్ పార్టీ ఉందని, సర్పంచిగా గెలువని వ్యక్తులు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.