బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలి

– బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్
– వాకర్స్ తో ముచ్చటించిన వినోద్ కుమార్
నవతెలంగాణ – జమ్మికుంట
వచ్చే నెల 13న జరిగే లోక్ సభ ఎన్నికల్లో బి ఆర్ఎస్ పార్టీ నుండి కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని, నాకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం ఉదయము స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో వాకర్స్ తో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి,  బి ఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ముచ్చటించారు. బోయినపల్లి వినోద్ కుమార్ మైదానంలో యువకులతో కలిసి క్రికెట్ క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలుపుతూ మే13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి  అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి , మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు , ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, బి ఆర్ ఎస్ వి రాష్ర్ట అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ ,మున్సిపల్ చైర్మన్  రాజేశ్వర్ రావు, సింగిల్ విండో చైర్మన్ పొనగంటి సంపత్ బి ఆర్ ఎస్ పట్టణ  అధ్యక్షులు టంగుటూరి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love