విలాసాగర్ సర్పంచ్ ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే, జడ్పీ ఛైర్ పర్సన్

– సర్పంచ్ లకు అండగా నేనుంటా ..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
– సర్పంచులకు ఘన సన్మానం
నవతెలంగాణ – జమ్మికుంట
ఈనెల 31వ తేదీ తో సర్పంచ్ ల పదవీకాలం ముగియనుంది. గురువారం జమ్మికుంట మండల 20 మంది సర్పంచులకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజరాబాద్ లో శాలువాతో, మెమెంటో తో ఘన సన్మానము నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్పంచులందరికీ నేను అండగా ఉంటానని మీ సమస్యల కోసం ప్రభుత్వంతో పోరాడుతానని  తెలిపారు. అన్ని గ్రామాల సర్పంచులు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ప్రజల కోసం ఎనలేని సేవలు చేశారని ఆయన కొనియాడారు. నేను ఎమ్మెల్యేగా గెలవడానికి ప్రతి సర్పంచ్ శ్రమ ఉందన్నారు. మీ శ్రమ నేను మరువలేనన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, కేడీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు పింగిలి రమేష్ ,జమ్మికుంట ఎంపీపీ మమత, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలేని సత్యనారాయణ రావు, వైస్ ఎంపీపీ పొల్సాని తిరుపతిరావు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love