శంకరయ్య చిత్రపటానికి పూలమాలలు వేస్తున్న డాక్టర్ ఉడుగుల సురేష్

– మాజీ ఉపసర్పంచ్ కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్, మాజీ కౌన్సిలర్, బిజెపి రాష్ట్ర నాయకులు పొన్నగంటి శంకరయ్య ఇటీవల గుండెపోటుతో మరణించారు. గురువారం మృతుని కుటుంబ సభ్యులను ఐఎంఏ జమ్మికుంట, హుజరాబాద్ ప్రధాన కార్యదర్శి, జమ్మికుంట సంజీవని మల్టీప్లెక్స్ హాస్పిటల్  డాక్టర్ ఉడుగుల సురేష్, డాక్టర్ కామిశెట్టి కిషోర్, డాక్టర్ ముషం సురేష్ పరమార్శించి, మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు .తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. శంకరయ్య చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో  నాయకులు పొన్నగంటి రవి కుమార్ (పి జె ఆర్) గాండ్ల సంపత్, చందన సురేష్, ఎగేటి కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
Spread the love