ఘోర రోడ్డు ప్రమాదం -ముగ్గురు మృతి

నవతెలంగాణ- అమరావతి: నక్కపల్లి జాతీయ రహదారి పై వెదుళ్ల పాలెం జంక్షన్ వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గోపాలపట్నం కు చెందిన శరగడం వెంకటలక్ష్మి, కుమారుడు వికాస్, అగనంపూడి కి చెందిన దాడి గగన్, విశాఖపట్నం కు చెందిన సుంకర మధుకర్ కలిసి కారులో కాకినాడ బయలుదేరి వెళుతున్నారు. నక్కపల్లి మండలం, వెదుళ్ల పాలెం వద్దకు వచ్చేసరికి కారు టైర్ పంచరై అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి రోడ్డుపైకి దూసుకుపోవడంతో తుని వైపు నుంచి విశాఖపట్నం వెళ్తున్న లారీ ఢీకొంది.ఈ ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ కారులో చిక్కుకుని, తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. వికాస్ తీవ్రంగా గాయపడడంతో అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు.

Spread the love