తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం పుస్తకం ఆవిష్కరణ

నవతెలంగాణ-భూపాలపల్లి
జిల్లాలో పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, సామాజికవేత్తలు, తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా అన్నారు. మంగళవారం కలెక్టర్‌ ఛాంబర్‌ లో రాష్ట్ర ప్రణాళిక శాఖ, హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో ముద్రించిన తెలంగాణ సామాజిక ఆర్థిక ముఖచిత్రం 2023 పుస్తకమును జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ పుస్తకం నిరుద్యోగ యువతకు, విద్యార్థులకు , మేధావులకు, విద్యావేత్తలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌, వివిధ పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ పుస్తకం ద్వారా ప్రభుత్వ విధానాలు, ప్రాధాన్యత పథకాల కార్యక్రమాల పూర్తి సమాచారాన్ని విశ్లేషిస్తుందని, రాష్ట్రం సాధించిన ప్రధాన విజయాలను ప్రముఖంగా పేర్కొనడం జరుగుతుందని, ప్రభుత్వ పాలనకు పారదర్శకత కల్పించడంతోపాటు బంగారు తెలంగాణ సాధనకు భవిష్యత్‌ మార్గాల కై సమగ్రమైన అధ్యయనం చేసే అవకాశం కల్పిస్తుందని తెలిపారు. 311పేజీలు ఉన్న ఈ పుస్తకం ధర రూ.150 కే అందించానున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి ముఖ్య ప్రణాళిక అధికారి జయశంకర్‌ భూపాలపల్లి కార్యాలయంలో అందుబాటులో ఉంటాయని కలెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి సామ్యూల్‌, ఉప గణాంక అధికారులు శ్రీమతి అలివేణి, శ్రీమతి కె.మహిన ఇతర కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love