మహిళ శక్తి స్టిచ్చింగ్ సెంటర్ ప్రారంభం..

నవతెలంగాణ – శంకరపట్నం
శంకరపట్నం మండల కేంద్రంలోని కేశవపట్నం గ్రామంలో ఏపీవో సుధాకర్  ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో డిఆర్డిఓ డిపిఎం రవీందర్, సంఘాల మహిళల సమక్షంలో మహిళ శక్తి స్టిచ్చింగ్ సెంటర్ ప్రారంభించారు. అనంతరం అయన మాట్లాడుతూ, గతంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పాఠశాలల్లో దుస్తులను టెండర్ల వద్ద నుంచి వచ్చాకనే ఉపాధ్యాయులు పంపిణీ చేసేవారు. ప్రభుత్వం నుంచి నేరుగా డిఆర్డిఏ కు  సంస్థకు అందజేయడం జరిగిందని,ఆయన అన్నారు.మండలంలో స్వశక్తి మహిళా సంఘాల మహిళలకు ఆర్థికంగా ఉపయోగపడేలా మహిళలకు ప్రభుత్వం పని కల్పిస్తుందని  ఉన్నారు.ఐకెపి సిబ్బంది విద్యార్థుల దుస్తులను కుట్టించి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు డి ఆర్ డి ఏ సంస్థ ద్వారా అందజేయడం జరుగుతుందని తెలిపారు. తద్వారా మండల కేంద్రంలో మహిళా శక్తి స్టిచ్చింగ్ సెంటర్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు అనిత, ఐకెపి సిబ్బంది సంపత్, అజీమ్, గ్రామ వివోలు శ్రీలత, లక్ష్మి, కట్టర్స్ వేణు కొమురయ్య, మహిళా సభ్యురాలు, పాల్గొన్నారు.
Spread the love