అసెంబ్లీలో పెరిగిన కాంగ్రెస్ బలం..

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 71సీట్లకు చేరింది. తాజాగా చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నుంచి మొత్తం ఆరుగురు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరినట్లయింది. దీంతో సభలో కాంగ్రెస్‌కు 71 మంది ఎమ్మెల్యేల బలం చేకూరింది. బీఆర్ఎస్ సీట్ల సంఖ్య 32కు పడిపోయింది. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎమ్ఐఎమ్ 7, సీపీఐ 1 సీటు గెలిచాయి.

Spread the love