- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో జరిగిన ఇండియా బ్లాక్ నేతల సమావేశం ముగిసింది. ఈ భేటీ అనంతరం డీలిమిటేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. డీలిమిటేషన్ పేరుతో జరుగుతున్న మోసాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తూనే, దానిని డీలిమిటేషన్ అమలుకు దొంగదారిగా వాడుకుంటున్నారని విమర్శించారు. 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో ఈ బిల్లు అవసరమా అని జైరాం రమేష్ ప్రశ్నించారు.
- Advertisement -



