ప్రమాద భీమా చెక్కు అందజేత

నవతెలంగాణ – రామారెడ్డి
మండలంలోని మోషన్ పూర్ గ్రామానికి చెందిన బొంపల్లి రవి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కోతులు అడ్డు రావడంతో ప్రమాదవశాత్తు వాహనం నుండి పడి కాలు విరగడంతోపాటు గాయాలు కావడంతో, గత నాలుగు నెలల క్రితం పోస్ట్ ఆఫీస్ లో రూ.520 తో ప్రమాద బీమా తీసుకోవడంతో, ఆయనకు ప్రమాద బీమా క్రింద ఆసుపత్రి ఖర్చుల నిమిత్త రూ.77000 విలువ గల చెక్కును జిల్లా ఐపిపిబి మేనేజర్ పవన్ రెడ్డి, స్థానిక ఎంపీడీవో సవితా రెడ్డి తో కలిసి బాధితుడికి చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ…పోస్ట్ ఆఫీస్ పేద ప్రజలకు అందిస్తున్న అతి తక్కువ ప్రీమియంతో, 10 లక్షల ప్రమాద బీమా ను అందజేయడాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని సూచించారు. పవన్ రెడ్డి మాట్లాడుతూ… కామారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 18 మంది లబ్ధిదారులకు రూ.ఒక కోటి 80 లక్షల క్లైమ్, 25 మందికి మెడికల్ క్లెయిమ్స్ సెటిల్ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో ధర్మారెడ్డి, ఎస్ పి ఎం వేణుగోపాల్, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love