మెదక్ ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

– ఎంపీ అభ్యర్థి నీలం మధును అధిక మెజార్టీతో గెలిపించుకుందాం
నవతెలంగాణ – మిరుదొడ్డి 
బహుజన నాయకుడు నీలం మధు నాయకత్వంలో మెదక్ జిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిష్టయ్య, సిద్ది భూపతి గౌడ్ అన్నారు. శుక్రవారం దుబ్బాక నియోజకవర్గం  లో మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి  మధును కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి గ్రామల అభివృద్ధికి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషి మరవలేని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన పేద ప్రజలను మోసం చేసింది అని అన్నారు. టిఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పడానికి కాంగ్రెస్ జెండాను మెదక్ ఎంపీ అభ్యర్థి ఆధ్వర్యంలో అధిక మెజార్టీ గెలిపించుకుందామని వారు తెలిపారు. వారి వెంట  కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. దుబ్బాక నియోజకవర్గం లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఎక్కడ కూడా అందించని స్థితి నెలకొందన్నారు ప్రభుత్వ సంక్షేమాల పేరుతో ఎన్నో నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత పేద ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడానికి ఎంతో కృషి చేస్తుందని అన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించుకొని సంక్షేపారాలను అందుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love