వర్షాలు కురవాలని గ్రామదేవతలకు జలాభిషేకం

నవతెలంగాణ-గోవిందరావుపేట : వర్షాలు సకాలంలో కురవాలని పంటను సమృద్ధిగా పండాలని మండల కేంద్రంలో సోమవారం గ్రామ దేవతలకు గ్రామస్తులు జలాభిషేకం చేశారు. వరుణుడు కరుణించి వర్షాలు పడాలని ఆలయ కమిటీ అధ్యక్షుడు మాచినేని రాజారావు ఆధ్వర్యంలో ఉదయం 7 గం లకు ఆలయము నకు చేరుకొని కాళీ బిందెలతో మంగళ వాయిద్యాలతో వాగులో పూజా కార్యక్రమాలు చేసి బిందెలతో నీటిని తీసుకొని వచ్చి గోవిందరాజుల స్వామి ,మరియు బొడ్రాయి వద్ద దేవతా మూర్తుల కు జలాభిషేకం చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ,అనంతరం ఆలయంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు , ఈ కార్యక్రమం లో రైతు పెద్దలు ,మాచినేని బాబురావు , సాంబయ్య ,కొమ్మరాజు సత్యనారాయణ ,ఆలూరి శ్రీను ,హనుమంతరావు ,బల్లేకారి రవి ,పాలడుగు ఉమా మహేశ్వర రావు , మాచి నేనీ రాధ , చింతల సత్యనారాయణ రెడ్డి , , గూడవల్లి జయ ప్రకాష్ ,నర్రా శివాజీ , మరియు రైతు సోదరులు ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Spread the love