ఝాన్సీ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి

– కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్
నవతెలంగాణ-పెద్దవంగర: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండల అధ్యక్షుడు ముద్దసాని సురేష్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పలు వీధుల్లో గడపగడపకు కాంగ్రెస్ ఆర్ గ్యారంటీ పథకాలపై ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న  రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. పాలకుర్తి లో కాంగ్రెస్‌ జెండా ఎగురుతుందని, ఓటర్లు తమవైపు చూస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుకుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి ముత్యాల పూర్ణచందర్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గద్దల ఉప్పలయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అనపురం శ్రీనివాస్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ జాను, అనపురం వినోద్, మండల మహిళ అధ్యక్షురాలు చిలుక దేవేంద్ర, కందుల యాకరాజు, నిమ్మల వీరన్న యాదవ్, సత్తిరెడ్డి, కుంభ మహేందర్, బెడుధ మంజుల, రాయపల్లి యాకయ్య, శ్రీరామ్ సోమన్న, చిలుక వీరయ్య, బత్తుల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love