కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు

– నాయకులకి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి
నవతెలంగాణ- తొర్రూర్ రూరల్
మండలంలోని సోమరపు కుంట తండాకు చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ అధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్లి తిరిగి, బిఆర్ఎస్ పార్టీలో చేరగా,  ఎర్రబెల్లి దయాకర్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ…. మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నీ భారీ మెజార్టీ తో గెలిపిస్తాం అన్నారు. అలాగే, కంటాయపాలెం మాజీ సర్పంచ్ పల్లె సర్వయ్య, హరిపిరాల, దుబ్బ తండా, మంగళి సాయి తండాకు చెందిన కాంగ్రెస్ నేత జాటోత్ భాస్కర్ లు 20 మంది, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పోనుగోటి సోమేశ్వర్ రావు అధ్వర్యంలో  పార్టీలో చేరగా, ఈ సందర్భంగా పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ , మంత్రి ఎర్రబెల్లి  చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు చూసి  పార్టీలో చేరుతున్నాం అన్నారు. పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి  పార్టీని గెలిపించడానికి శాయ శక్తుల కృషి చేయాలి అన్నారు.
Spread the love