కనక్ అగర్వాల్ నాస్  గర్ల్స్ స్కాలర్‌షిప్

వ్యవసాయ విద్యలో బాలికలకు సాధికారత కల్పించేందుకు మొదటి సంవత్సరం రూ.33 లక్షల విలువైన స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్

  • రాష్ట్ర/కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో బాలికలకు ప్రతి సంవత్సరం మొత్తం 84 స్కాలర్‌షిప్‌లు అందించనుంది.
  • క్రిస్టల్ క్రాప్ ప్రారంభంలో మొదటి సంవత్సరానికి రూ.33 లక్షల కంటే ఎక్కువ విరాళం ఇవ్వనుంది.
  • దివంగత శ్రీమతికనక్ అగర్వాల్ గౌరవార్థం స్కాలర్‌షిప్ ను ప్రారంభించింది
  • వచ్చే జూలై/ఆగస్టు2024 సెషన్ నుండి స్కాలర్‌షిప్ ల అందించబడతాయి.

నవతెలంగాణ న్యూఢిల్లీ: సుప్రసిద్ధ అగ్రోకెమికల్ సంస్థ అయిన క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్, వ్యవసాయ విద్యాభివృద్ధికి మరియు మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు తన నిబద్ధతను ప్రకటించింది. నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (NAAS) సహకారంతో, ఈ బ్రాండ్ వ్యవసాయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ప్రోగ్రెసివ్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. అంకుర్ అగర్వాల్ యొక్క  దివంగత తల్లి కనక్ అగర్వాల్ గౌరవార్థం ఈ కార్యక్రమం ప్రారంభించబడింది.
ఈ ప్రత్యేక కార్యక్రమం వ్యవసాయ రంగంలో మార్పు తీసుకురావాలనే మక్కువతో ఉన్న యువతులకు ఆర్థిక సహాయం,  అవకాశాలను అందించడం ద్వారా తదుపరి తరం విద్యార్థుల ఆకాంక్షలను తీర్చనుంది. ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ సంవత్సరానికి 21 మంది బాలికల చొప్పున  ప్రతి సంవత్సరం మొత్తం 84 స్కాలర్‌షిప్‌లను అందజేస్తుంది. “క్రిస్టల్ క్రాప్‌ వద్ద  మేము భారతదేశ వ్యవసాయరంగంలో మహిళలు పోషించే కీలక పాత్రను మేము ఎంతో గౌరవిస్తాము. ఈ స్కాలర్‌షిప్ కార్యక్రమ ప్రారంభంతో, బాలికల విద్య కోసం నిష్కపటం గా ప్రయత్నించిన మా  తల్లికి మేము నివాళులర్పిస్తున్నాము,  ఈ వర్ధమాన ప్రతిభావంతులను అవసరమైన మద్దతు అందించటం ద్వారా వారు విద్యాపరంగా రాణించడమే కాకుండా కెరీర్‌ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా కూడా ముందుకు సాగాలని మేము భావిస్తున్నాము” అని  క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అంకుర్ అగర్వాల్ అన్నారు.
ఈ కార్యక్రమం జూలై/ఆగస్టు, 2024లో జరగబోయే సెషన్ నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తుదారులు మరింత సమాచారాన్ని నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ & క్రిస్టల్ క్రాప్ వెబ్‌సైట్ ద్వారా పొందవచ్చు. “ఈ ఉదాత్తమైన కార్యక్రమం ద్వారా, మేము విద్యార్థుల భవిష్యత్తుపై పెట్టుబడి పెట్టడమే కాకుండా మొత్తం వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభావితం చేస్తున్నాము. ” అని  డాక్టర్  హిమాన్షు పాఠక్, సెక్రటరీ, డేర్ & డైరెక్టర్ జనరల్, ICAR అన్నారు.

Spread the love