పాలస్తీనాకు కాశ్మీర్‌ సంఘీభావం

– హురియత్‌ నేత మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌
శ్రీనగర్‌: కాశ్మీర్‌ ప్రజలు పాలస్తీనాకు తిరుగులేని మద్దతుగా ఐక్యంగా ఉన్నారని పాలస్తీనియన్లకు ఆల్‌ పార్టీస్‌ హురియత్‌ కాన్ఫరెన్స్‌ చైర్మెన్‌ మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ సంఘీభావం తెలిపారు. నాలుగు సంవత్సరాల తర్వాత ఇటీవల తన గృహ నిర్బంధం నుంచి విడుదలైన మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూఖ్‌ తాజాగా ఈ ప్రకటన చేశారు. ”ఈ సంఘర్షణ మూలాలు మళ్లీ వలసరాజ్యాల గతానికి సంబంధించినవి. వారు పాలించినప్పుడు వలసరాజ్యాల యజమానులు తీసుకున్న నిర్ణయాలలో దీని విషాదకరమైన ప్రభావం ఈ రోజు వరకు స్థానికులు అనుభవిస్తున్నారు” అని ఉమర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న నిరంతర దాడి ఆరో రోజుకు చేరుకున్నది. ఐక్యరాజ్యసమితి(యూఎన్‌ఓ) సెక్రెటరీ జనరల్‌ ‘తీవ్రమైన బాధ’ అని పేర్కొన్న ముట్టడి ప్రాంతంలో 250 మంది పిల్లలతో సహా 1055 మందికి పైగా పౌరులు మరణించారు. హమాస్‌ తన ఆపరేషన్‌ ”అల్‌-అక్సా ఫ్లడ్‌” ప్రారంభించిన తర్వాత ఈ దాడి జరిగింది.

Spread the love