పేద విద్యార్థుల పాలిట అన్నదాత కేసీఆర్

– సీఏం బ్రేక్ ఫాస్ట్ ప్రారంభోత్సవంలో మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-బోడుప్పల్: తెలంగాణ రాష్ట్రంలోని పేద విద్యార్థుల పాలిట సీఎం కేసీఆర్ అన్నదాతగా నిలిచిపోతారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం నాడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్కారు బడులలో ప్రారంభించిన సీఏం బ్రేక్ ఫాస్ట్ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా పీర్జాదీగూడ నగర పాలక సంస్థ పరిధిలోని మేడిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో మంత్రి మల్లారెడ్డి ముఖ్య అతిధిగా హజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దిన ఘనత సీఏం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు దేశంలోనే సర్కారు బడులలో పేద విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్, మద్యాహ్న భోజనం పెట్టి విద్యార్థుల కడుపు నింపిన ఘనత ముఖ్యమంత్రి కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గా దయాకర్ రెడ్డి, డీఈవో విజయకుమారి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమీషనర్ నమ్య,మేడిపల్లి తహసీల్దారు హసీనా, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పాశం రాజు యాదవ్,కార్పొరేషన్ కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Spread the love