డీఎస్ మృతి పట్ల కేసీఆర్ సంతాపం..

నవతెలంగాణ – హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఈ సందర్బంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంతకుముందు మాజీ మంత్రులు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డిలు డీఎస్ మృతి పట్ల సంతాపం తెలిపారు.

Spread the love