నవతెలంగాణ -ముధోల్ : మండల కేంద్రమైన ముధోల్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)నుశుక్రవారంఎంపిఓ శివకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్నభోజనంనుపరిశీలించారు.ప్రిన్సిపాల్ పరత్ బేగం, ఉపాధ్యాయులతో, మాట్లాడి పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు.వంటశాలను, ఆహార పదార్థాల నిల్వ గదిని పరిశీలించి, బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల నాణ్యతను తనిఖీ చేశారు.విద్యార్థినులను భోజనం, వసతి, సౌకర్యాల గురించి అడిగితెలుసుకున్నారు.ఈసందర్భంగా ఎంపిఓ స్వయంగా విద్యార్థినులకు అన్నం వడ్డించి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.
కేజీబీవీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



