నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో మంత్రి కేటీఆర్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. సిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బరిలో నిలిచారు. నామినేషన్ దాఖలు కంటే ముందు కేటీఆర్ ప్రగతి భవన్లో ప్రత్యేక పూజలు చేసిన సంగతి తెలిసిందే. మరికాసేపట్లో ఆర్మూర్లో నిర్వహించే రోడ్షోలో కేటీఆర్ పాల్గొననున్నారు. సాయంత్రం కొడంగల్లో నిర్వహించే రోడ్షోలో పాల్గొననున్నారు.