లాస్య నందిత దవడ, ఛాతీ ఎముకలు విరిగాయి: గాంధీ’ వైద్యులు

నవతెలంగాణ – హైదరాబాద్: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ భారాస ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతికి సంబంధించిన వివరాలను గాంధీ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ప్రమాదంలో ఆమె తలకు తీవ్ర గాయాలైనట్లు పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం వైద్యులు మీడియాకు తెలిపారు. లాస్య నందిత దవడ ఎముక విరిగిందని.. ఎడమ కాలు ఎముక, ఛాతీ ఎముకలు సైతం విరిగాయని పేర్కొన్నారు. మరోవైపు, ఈ ప్రమాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నందిత మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరిగిందని.. డ్రైవర్‌ నిద్రమత్తు, వేగమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది.

Spread the love