బాధ్యతలు స్వీకరించిన ఎల్.ఎఫ్.ఎల్ హెడ్ మాస్టర్ శ్రీనివాసరావు 

నవతెలంగాణ – ఆళ్ళపల్లి 
ఇటీవల జరిగిన ఉపాద్యాయుల బదిలీల్లో భాగంగా ఆళ్ళపల్లి మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ కు నూతనంగా వచ్చిన ఎల్.ఎఫ్.ఎల్ హెడ్ మాస్టర్ ఎం.శ్రీనివాసరావు శనివారం పూర్తి బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీనివాసరావు ఇల్లందు పట్టణంలోని పాఠశాలలో విధులు నిర్వహించారు. రానున్న రోజుల్లో విద్యార్థుల విద్యాపరమైన వికాసానికి అన్ని విధాలా కృషి చేస్తానని శ్రీనివాసరావు తెలిపారు. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా ఆళ్ళపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా బూక్యా రమేష్ విధులు నిర్వహించిన విషయం విదితమే. దానికి గాను విధి నిర్వహణలో తనకు సహకరించిన స్థానిక ఎంఈఓ పి.కృష్ణయ్య, కాంప్లెక్స్ హెచ్.ఎం కె.శాంతారావు, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు బి.రమేష్ కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love