గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు స్వల్ప ఊరట

నవతెలంగాణ – హైదరాబాద్: కొత్త ఏడాది తొలి రోజున వినియోగదారులకు స్వల్ప ఊరట దక్కింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ల ధరలు స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీలో రూ.1755.50గా ఉన్న 19కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1757కు చేరుకుంది. ముంబైలో కూడా సిలిండర్ ధర రూ.1708కు తగ్గింది. చెన్నైలో ధరలు రూ.4.50 మేర ధర తగ్గింది. ప్రస్తుత ధర రూ.1929గా ఉంది. అయితే, డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎటువంటి మార్పూలేదు. మరోవైపు, విమానం ఇంధన ధరల్లో కూడా స్వల్పంగా తగ్గాయి.

Spread the love