వంటగ్యాస్ e-KYCపై కీలక ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తెలిపింది. డెలివరీ బాయ్స్ తమ వద్ద ఉన్న యాప్ ద్వారా e-KYC పూర్తి చేయొచ్చని పేర్కొంది. గ్యాస్ ఈ-కేవైసీకి ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేసింది.

Spread the love